న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సమాజాన్ని చైతన్యపరచడం కోసం ప్రసారం చేసే కండోమ్ యాడ్స్ వల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో, ఈ నెల 11న సమాచార ప్రసారాల శాఖ కండోమ్ ప్రకటనలను నిషేధించిన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను ప్రశ్నిస్తూ రాజస్థాన్ హైకోర్టు వివరణ కోరడంతో, సమాచార ప్రసారాల శాఖ నిబంధనలలో స్వల్ప మార్పులు తీసుకువచ్చింది. ప్రకటనలో అశ్లీల సన్నివేశాలు, మహిళలను కించపరిచే విధంగా ఉన్న సన్నివేశాలు లేని కండోమ్ యాడ్స్ కు మినహాయింపు కల్పిస్తునట్లు ప్రకటించింది.