నెల్లూరు, డిసెంబర్ 21: నగరంలో రవాణాశాఖలో ఏఓగా పనిచేస్తున్న కృష్ణకిషోర్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. అంతేకాదు రవాణాశాఖ ఏజెంట్లుగా ఉన్న చెంచయ్య, ఎల్లయ్య ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. వీరిద్దరూ కృష్ణకిషోర్ బినామీలుగా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.