2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం పై నేడే తుది తీర్పు

SMTV Desk 2017-12-21 10:32:38  2 g spectrum, scam, final judgement, tamila nadu

న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : దేశం మొత్తం సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం పై పాటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన ఈ భారీ కుంభకోణం లో తమిళనాడు డీఎంకే పార్టీ రాజా, కనిమొళి ఈ కేసులో చిక్కుకుని ఉండడం, ఈ రోజు ఆర్కే నగర్ ఉప ఎన్నికలు జరగడంతో కోర్టు తీర్పు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో మరి కొద్ది క్షణాల్లో తీర్పు వెలువడనుండగా రాజా, కనిమొళి దోషులుగా జైలుకా, నిర్దోషులుగా ఇంటికా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.