న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తెలుగు దేశం పార్టీ ప్రజా ప్రతినిధుల బృందం, నేడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిసింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు పలువురు తెదేపా ఎంపీలు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన హామీలతో పాటు నియోజకవర్గాల పెంపు అంశంపైనా చర్చించారు.