అమరావతి, డిసెంబర్ 20: రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు స్కోచ్ టెక్నాలజీ క్యాటగిరిలో ఓ అవార్డు దక్కింది. ఆంధ్రపదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు మొత్తం 5 స్కోచ్ అవార్డులు లబించాయి. గ్రామీణాభివృద్ధి శాఖల డ్యాష్ బోర్డు, బ్లూ ఎకానమీ క్యాటగిరీలో జలవాణి కాల్ సెంటర్, ఎన్టీఆర్ జలసిరి, ఐవోటీ ద్వారా ఎల్ఈడీ లైట్ల పర్యవేక్షణకు మొబిలిటీ అవార్డులు వచ్చాయి. ఇక ఆర్ఎఫ్ఐడీ కార్డు ద్వారా చెత్త సేకరణ పథకానికి కూడా అవార్డు సాధించింది.