ఎర్ర చందనం స‍్మగ‍్లర్లు 15 మంది అరెస్ట్...

SMTV Desk 2017-12-20 15:40:03  redsandalwood, Smuggling, crime, kadapa

కడప, డిసెంబర్ 20: జిల్లాలోని సుండుపల్లి శేషాచల అడవుల్లో ఎర్ర చందనం దుంగలను పోలీసులు ఈ ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ 250 కిలోలు గల ఎర్రచందనం విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర‍్భంగా 15 మంది స‍్మగ‍్లర‍్లను అరెస్టు చేశారు. స‍్మగ‍్లర‍్ల నుంచి 8 మొబైల్‌ ఫోన‍్లు, రూ.30 వేల నగదు, ఒక టెంపో వాహనాన్ని స్వాధీనం చేసుకున‍్నట్లు కడప డీఎస్పీ మాసూమ్‌బాషా వెల్లడించారు.