హైదరాబాద్, డిసెంబర్ 20 : అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని అఖిల్ కథానాయకుడిగా ‘హలో’ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను నేడు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాగార్జున దంపతులు షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. దీంతో నాగ్ తన ఫేస్బుక్లో పోస్ట్ లో బాబా ఆశీస్సులు పొందుతున్న ఫొటోతో పాటు "థ్యాంక్యూ బాబా" అని పోస్ట్లో పేర్కొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్కు ముందు బాబా ఆశీర్వాదం తీసుకోవడానికి ఇలా నా స్నేహితుడు మహేశ్తో కలిసి షిర్డీకి వచ్చినట్లు అందులో నాగ్ తెలిపారు. ఈ చిత్రానికి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్కి జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటించారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.