న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఢిల్లీలో కలిందికుంజ్ డిపో రైల్వేస్టేషన్ వద్ద మెట్రో రైలు ప్రమాదానికి గురైంది. ఈ నెల 25న ప్రధాని మోదీ ఈ నూతన రైలును ప్రారంభించాల్సి ఉండగా.. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా స్టేషన్లో సరిహద్దు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, రెండు కోచ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ బ్రేక్ పడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. కల్కాజీమందిర్- బొటానికల్ గార్డెన్ను కలుపుతూ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఈ మార్గాన్ని మెజెంతా లైన్గా వ్యవహరిస్తున్నారు.