హైదరాబాద్, డిసెంబర్ 19: నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... స్వరూప్నగర్కు చెందిన భూమిక అనే చిన్నారిని తల్లి నాచారంలోని జాన్స్ గ్రామర్ పాఠశాలకు స్కూటీపై వెళ్తుండగా, చిలుకానగర్కు చేరుకున్న సమయంలో వెనుక నుంచి ఓ లారీ వచ్చి స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో చిన్నారి భూమిక అక్కడికక్కడే మృతిచెందగా, తల్లి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.