హైదరాబాద్, డిసెంబర్ 18 : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. ఇప్పటికే ఈ సినిమా టీజర్కు విశేష స్పందన లభించింది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు టీజర్ ఆకట్టుకుందని ట్వీట్లు చేశారు. ఈ టీజర్ను ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ, హీరో రామ్చరణ్ ఫేస్బుక్ వేదికలో ‘‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ అద్భుతంగా ఉంది.. పీకే (పవన్కల్యాణ్) అత్యుత్తమంగా కనిపించారు’. అంటూ రామ్గోపాల్ వర్మ, అలాగే ‘బాబాయ్ ఎట్ హిజ్ బెస్ట్, ఈ సినిమా కోసం సంక్రాంతి త్వరగా రావాలని ఎదురుచూస్తున్న అంటూ రామ్ చరణ్ టీజర్ ను తిలకించి వారి అభిప్రాయాన్ని తెలిపారు. కాగా, ఈ నెల 16న విడుదలైన ఈ ప్రచార చిత్రానికి యూట్యూబ్లో ఇప్పటి వరకు 78.86 లక్షల మంది వీక్షించారు. 4,49,001 మంది లైక్ చేశారు. తాజాగా ఇది యూట్యూబ్ ట్రెండింగ్లో ఒకటో స్థానంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి రికార్డును ‘అజ్ఞాతవాసి’ టీజర్ ట్విట్టర్ హాష్(#) ట్యాగ్ రూపంలో నాలుగో స్థానంలో నిలిచి, కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు అందిస్తున్నారు. జనవరి 10న సంక్రాంత్రి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయగా, ఈ నెల 19న ఆడియో రిలీజ్ చేయనున్నారు.