న్యూఢిల్లీ, డిసెంబర్ 18: భాజాపాకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించినట్లు ప్రకటించారు. బీజేపీకి చెందిన ఆదిత్యానాథ్ యూపీ సీఎం ఎంపిక కావటం, మరో ఎంపీ కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది. ఇక మహారాష్ట్రకు చెందిన నానా పటోలే పార్టీపై అసంతృప్తితో ఈ మధ్యే తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే.