వాషింగ్టన్, డిసెంబర్ 18: ఐదు దశాబ్దాల పాటు అమెరికాలో జంబో జెట్గా పెరుగాంచిన బోయింగ్ 747 విమానం తన సేవలకు గుడ్ బై చెప్పనుంది. మంగళవారం తన చివరి ప్రయాణాన్ని డెల్టా ఎయిర్ లైన్స్ సియోల్ నుంచి డెట్రాయిట్ మార్గంలో చేపట్టనుంది. ఆధునిక సదుపాయాలతో ఈ విమానం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దూరం ప్రయాణించే మోడళ్లవైపు దృష్టి పెట్టి ఈ బోయింగ్కు వీడ్కోలు పలుకుతున్నారు. ఈ వీడ్కోలు ప్రయాణానికి కూడా విపరీత స్పందన లభిస్తోంది. చివరిసారిగా ఈ విమానాన్ని ఎక్కాలని ప్రయాణికులు ఆసక్తిచూపిస్తుండటంతో టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. 1969లో తొలిసారిగా ప్రారంభమైన బోయింగ్ 747 విమాన౦లో ఒకేసారి 600 మంది ప్రయాణించే వీలుంది. ఇప్పటివరకూ 1500 బోయింగ్ 747 విమానాలను వివిధ ఎయిర్లైన్స్లకు అందించారు.