చంద్రబాబు మా పాలిట భోళా శంకరుడు : హిజ్రాలు

SMTV Desk 2017-12-17 18:41:31  chandrababu, hijra, ap govt,

తిరుపతి, డిసెంబర్ 17 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిజ్రాలకు ఫెన్షన్ తో పాటు, రేషన్ కార్డు, ఇండ్ల స్థలాలను అందజేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి లోని హిజ్రాలు ఎపి సిఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, సంబరాలు జరుపుకున్నారు. నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇంత వరకు మాకు ఎలాంటి గుర్తింపు లేదని, చంద్రబాబు మా పాలిట భోళా శంకరుడని కొనియాడారు. తమకు రూ.1500 ఫెన్షన్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇస్తున్న చంద్రన్నకు రుణ పడి ఉంటామన్నారు.