హైదరాబాద్, డిసెంబర్ 17 : ప్రస్తుతం భరత్ అనే నేను చిత్రం షూటింగ్లో బీజీగా ఉన్న సూపర్స్టార్ మహేశ్బాబు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప ట్విటర్ వాడారు. కేవలం తన సినిమా ప్రచార చిత్రాల విడుదల సమయంలోనే ట్వీట్లు చేస్తుంటారు. అయినా సరే ఆయనకు మాత్రం ట్విటర్లో క్రేజ్ పెరిగిపోతోంది. ఎంతగా అంటే మహేశ్ ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య తాజాగా 5 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన సతీమణి నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ట్విటర్లో తెలుగు హీరోల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఈ ఘనత మహేశ్కు దక్కడం విశేషమని అన్నారు. ఇంతటి ప్రేమాభిమానాలు చూపుతున్న అభిమానులకు హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా మహేశ్తో కూడిన ఓ ఫొటోను పంచుకున్నారు. ఏప్రిల్ 2010లో మహేశ్ ట్విటర్ ఖాతాను ప్రారంభించినా మహేశ్ను ఇంత మంది ఫాలో అవుతున్నా.. ఆయన మాత్రం ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నారు. ఆయన ఎవరో కాదు బావ గల్లా జయదేవ్ తోనట.