కడప, డిసెంబర్ 17: జిల్లాలో అక్రమ రవాణా దుండగుల ఆలోచనలు చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. దుంగల రవాణాకు అనుగుణంగా ఆయిల్ ట్యాంకర్ ను మార్చుకున్న డిజైన్ ను చూసి వారు నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళితే... భాకరాపేట సమీపంలోని కనుమలోపల్లె అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు రవాణా చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం రావడంతో వారు తనిఖీలు చేపట్టారు. దారిలో ఓ ఆయిల్ ట్యాంకర్ను పరిశీలించగా అందులో ఏ గ్రేడ్ రకానికి చెందిన ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని, ఏడుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు రూ.కోటి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.