నగర బస్సులపై మహాసభల ఎఫెక్ట్...

SMTV Desk 2017-12-16 18:11:36  maha sabhalu, buses, telugu words, telangana govt.

హైదరాబాద్, డిసెంబర్ 16 : అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలకు దేశ విదేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎంతో మంది సాహితీవేత్తలు, కవులు, గురువులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. నగరంలో బస్సులు తిరిగే మార్గాలకు తెలుగు అక్షరాలతో పేర్లను అంటించింది. ఉదాహరణకు 157వ నంబరు గల బస్సు వెళ్ళే మార్గానికి.. "మార్గం-గ" అని పేరు పెట్టింది. దీంతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.