బే ఏరియా, డిసెంబర్ 16 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి అక్కడి ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాష్ట్రంలో ఐటీ, ఆయా గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కోగంటి వెంకట్, అసూరి విజయ, కుదరవల్లి యశ్వంత్, బల్లా భక్తా, సతీష్ వేమూరి, కాకర్ల రజనీకాంత్, తోటరాం తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన తర్వాత కష్టాలు అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని, ఎన్ఆర్ఐలు ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.