మిషన్ భగీరథ పనులు దేశానికే ఆదర్శ౦ : కేంద్రమంత్రి

SMTV Desk 2017-12-16 16:51:02  Union Minister, Ramesh Gigigangi, mission bagiratha, telangana govt.

హైదరాబాద్, డిసెంబర్ 16 : కేంద్రమంత్రి రమేశ్ జిగజినాగి మిషన్ భగీరథ పనులపై ప్రశంసలు కురిపించారు. పారిశుధ్య పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్ డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి మిషన్ భగీరథ పనులపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనులు దేశానికే ఆదర్శమంటూ కొనియాడారు. ఇంటింటికి తాగు నీరు అందించడం గొప్ప విషయం. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం మిషన్ భగీరథ పనులను సందర్శిస్తానని వెల్లడించారు.