హైదరాబాద్, డిసెంబర్ 16 : కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, బస్తీల సంక్షేమ సంఘాల సమస్యల పరిష్కారం నిమిత్తం "మన నగరం" అనే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మక౦గా చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని నేడు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జోనల్ కమిషనర్ శంకరయ్య వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్ లలో తలెత్తుతున్న సమస్యలను సేకరించి మంత్రి కేటీఆర్ ముందుంచాల్సి౦దిగా ఆయా విభాగాల అధికారులకు సూచించారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా, లోటు పాట్లు జరగకుండా సంబంధిత అధికారులు బాధ్యత వహించాలన్నారు.