ముంబాయి, డిసెంబర్ 15: నూతన వధూవరులు బాలీవుడ్ బామ అనుష్క, కోహ్లీలు తమ హనీమూన్ ట్రిప్ లో సరదాగా గడుపుతున్నారు. ఈ సందర్బంగా వారిద్దరూ కలిసి దిగిన సేల్ఫీ ఫోటోను అనుష్క తన ఫేస్ బుక్ వేదికగా పంచుకుంది. ఆ ఫోటోలో చుట్టూ మంచు కొండల మధ్య చల్లని ప్రకృతిని అస్వాదిస్తూ కనిపిస్తారు. ఆ ప్రాంతం దక్షిణాఫ్రికాలోని ఒక చిన్నదీవి అని సమాచారం. ఇదిలా వుండగా ఈ నెల 21న ఢిల్లీలో తాజ్ డిప్లొమాటిక్ ఎంక్లేవ్లో ఈ జంట ఘనంగా విందు ఇవ్వనుంది.