న్యూఢిల్లీ, డిసెంబర్ 15: భారత క్రికెటర్ అజింక్యా రహానే తండ్రి మధుకర్ బాబూరావు రహానేను కొల్హాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విషయం ఏంటంటే... శుక్రవారం మధుకర్ కుటుంబంతో కలిసి తన కారులో వెళుతున్న సమయంలో కంగల్ ఏరియా పరిధిలో కారు అదుపుతప్పి అస్తాయ్ కాంబ్లే అనే మహిళను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పటికి, పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో అక్కడి పోలీసులు రహానే తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు ఐపీసీ సెక్షన్ క్రింద 304 ఎ, 337, 338, 184 నాలుగు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.