హైదరాబాద్, డిసెంబర్ 15 : కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తను పార్టీ మారుతున్నాడ౦టూ వచ్చే వార్తలను తోసిపుచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు పార్టీ మారే అవసరం లేదని, అసలు ఈ వార్తలపై వస్తున్న ఊహాగానాలపై స్పందించాల్సిన అవకాశం కూడా లేదన్నారు. అవసరమైతే వెళ్ళేటప్పుడు అందరికి చెప్పే వెళ్తానని, తన అనుచరులతో కలిసి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేయడం నిజమేనని స్పష్టం చేశారు.