అమరావతి, డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18 నుంచి 22 వరకు కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ప్రతి ఏటా సీఎం చంద్రబాబు ఆయన కుంటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్తుంటారు. ఈ ఏడాదిలో మాల్దీవుకు వెళ్లనున్నారు. అయితే, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తన పర్యటన ముగించుకుని నేరుగా మాల్దీవులు చేరుకోనున్నట్లు తెలుస్తోంది.