విశాఖ తీరానికి చేరిన క్రికెటర్లు...

SMTV Desk 2017-12-15 10:16:30  indian cricketers, srilanka, visakapatnam

విశాఖపట్టణం, డిసెంబర్ 15: విశాఖ తీరానికి భారత, లంక క్రికెటర్లు చేరుకున్నారు. ఈ నెల 17న భారత్‌- శ్రీలంకల మధ్య మదుర వాడలో జరిగే చివరి వన్డే మ్యాచ్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్ళు సిద్ధమయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఐదునక్షత్రాల హోటల్‌కి వారికీ అధికారులు ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి మైదానంలో ఇరు జట్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తాయి. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వారు బస చేసిన హోటల్‌ వద్దకు భారీ సంఖ్యలో చేరారు.