హైదరాబాద్, డిసెంబర్ 14 : టెక్ మహీంద్రా క్యాంపస్ లో నిర్వహించిన మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐటీ సంస్థల్లో పెద్ద పెద్ద కంపెనీలు సైతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుతం టీహబ్-2 నిర్మాణ దశలో ఉంది. యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాల నిమిత్తం ఈ ఐటీని వాడుతున్నాం. దీని ద్వారా స్కూల్ స్థాయి నుండే విద్యార్థులకు శిక్షణతో పాటు మంచి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి" అన్నారు. అదే విధంగా రానున్న మరో ఐదేళ్లల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.