న్యూఢిల్లీ, డిసెంబర్ 13: తాజాగా పేటీఎం 2017 గ్రాండ్ ఫైనల్ సేల్ ను ప్రారంభించింది. ఈ గ్రాండ్ సేల్, డిసెంబర్ 15 వరకు నిర్వహించనుంది. ఆపిల్, లెనోవో, మోటోరోలా, శాంసంగ్, షావోమి లాంటి అన్ని దిగ్గజ బ్రాండులపై పేటీఎం మాల్ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్పై రూ.4000 క్యాష్బ్యాక్ అందిస్తోంది. అదేవిధంగా రూ.64వేలుగా ఉన్న ఐఫోన్ 8(64జీబీ) వేరియంట్ను రూ.58,582కే లిస్టు చేసింది. "MOB7500" ప్రోమో కోడ్ను వాడుతూ ఐఫోన్ 8పై రూ.7500 వరకు క్యాష్బ్యాక్ను పొందవచ్చు. ఐఫోన్ 7(32జీబీ వేరియంట్) రూ.44,599కే అందుబాటులోకి వచ్చింది. మరిన్నీ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది.