విజయవాడ, డిసెంబర్ 13 : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా నదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీ-ప్లేన్లో విహరించారు. కృష్ణా నదిలో నిర్వహించిన ఈ ట్రయిల్ రన్లో భాగంగా సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్లో చక్కర్లు కొట్టారు. వారితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతి రాజు, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల, ఓ విద్యార్థిని ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ ప్రచారం ముగింపు సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం అహ్మదాబాద్లోని సబర్మతీ నది వద్ద ఈ సీప్లేన్లో చక్కర్లు కొట్టారు.