మెహలీ, డిసెంబర్ 13: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ద్విశతకంతో ఆదరగోట్టేశాడు. 153 బంతుల్లో 12 సిక్సర్లు, 13 ఫోర్లతో 208 పరుగులు చేశాడు. అంతేకాకుండా తన కెరీర్లోనే మూడో ద్విశతకాన్నిసాధించాడు. శ్రీలంకపై ఇది రెండోది కావడం విశేషం. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్(88) ఒక వికెట్ కోల్పోగా, అనంతరం క్రీజులోకి వచ్చిన మాజీ సారధి ధోని(7), హార్దిక్ పాండ్య ( 8) రెండు వికెట్లను కోల్పోయారు. నిర్ణిత ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది.