రోహిత్ సెంచరీ.. శ్రేయస్‌ హాఫ్ సెంచరీ...

SMTV Desk 2017-12-13 14:17:13  rohith sharma, shreyas ayyar, one day series, india, srilanka

మెహలీ, డిసెంబర్ 13: భారత ఓపెనర్ రోహిత్ శర్మ శతకంతో దూసుకెళ్తున్నాడు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేలో 115 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సుతో రోహిత్‌ కెరీర్లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ 50 బంతుల్లో 5 ఫోర్లతో తన కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 40 ఓవర్లలో వికెట్ కోల్పోయి 247 పరుగులు చేయగలిగింది.