మెహలీ, డిసెంబర్ 13: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ ధావన్, అర్ధ శతకం దాటేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 23 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి మ్యాచ్ లో దారుణంగా వికెట్లు కోల్పోయిన భారత్, అత్యంత జాగ్రత్తగా ఆడుతుంది. ఒకవైపు రోహిత్ శర్మ (45) హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. 20ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 108/0 తో ఉంది.