అహ్మదాబాద్, డిసెంబర్ 12 : రాహుల్ గాంధీ ఇటీవల జగన్నాథ ఆలయాన్ని దర్శించుకొన్నారు. ఈ క్రమంలో రాహుల్ ఆలయాలకు వెళ్లడంపై పలువురు బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను ఆలయాలకు వెళ్లడంపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. నాకు ఎలాంటి సమయాల్లోనైనా దేవాలయాలకు వెళ్ళే హక్కు ఉంది. ఈ మధ్యే కేధారినాథ్ కూడా వెళ్లాను. గుజరాత్ ప్రజల భవిష్యత్తు బాగుండాలని, వారు అభివృద్ధి చెందాలని నేను ఆలయాలను దర్శించుకుంటున్నా. అసలు ఆలయాలకు వెళ్లడం తప్పా"? అంటూ ప్రశ్నించారు. కాగా గుజరాత్ రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 14న జరగనున్నాయి.