విజయనగరం, డిసెంబర్ 12: జిల్లాలోని క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం బంకురువలస మాంగనీస్ క్వారీలో బండరాళ్లు పడి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు కార్మికులు ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడ్రోజుల వ్యవధిలో జిల్లాలో ఇది రెండో క్వారీ ప్రమాదం కావడం అక్కడి కార్మికులకు ఈ ఘటన శోచానీయంగా మారింది.