చెన్నై, డిసెంబర్ 11 : తమిళ నటుడు విశాల్ కు ఊహించని విధంగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. కాగా అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, సెక్రెటరీ విశాల్, ఉపాధ్యక్షులు పొన్వన్నన్, కరునాస్ జట్టుగా నడిగర్ సంఘం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ రాజకీయ రంగ ప్రవేశంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఉపాధ్యక్షులు పొన్వన్నన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, సంఘం వేరు అని రాహుల్ మాట్లాడిన మాటలకు అవాకయ్యానని పేర్కొన్నారు. ఈ దెబ్బతో నడిగర్ సంఘం ఐక్యత కోల్పోయినట్లు సమాచారం.