హైదరాబాద్, డిసెంబర్ 11 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. రాయదుర్గంలో సీబీఆర్ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా అవసరార్థం మెట్రో రైలు వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అలాగే ఐటీ కారిడార్ లలో మోనోరైలును తీసుకొచ్చే దిశగా ప్రణాళికలను రచిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ నిర్మాణం ఈ ఏడాదిలో పూర్తవుతుందని, నగరంలో తూర్పు వైపు అభివృద్దికి ఆస్కారం ఉందన్నారు.