హైదరాబాద్, డిసెంబర్ 11 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సొంత ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే. వారికి రైలు ప్రయాణం కొంచెం కష్టతరం కానుంది. దాదాపు అన్ని రైళ్ళలో రిజర్వేషన్లు నిండుకోగా, తత్కాల్ టికెట్లు తీసుకునే వారికి మోత మోగను౦ది. పండగ పేరుతో ప్రైవేటు రవాణా ఆపరేటర్లు ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. ధరలను రెండు రేట్లు పెంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పండగకు ప్రత్యేక రైళ్ళను కేటాయించాలని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.