ముంబాయి, డిసెంబర్ 10: తాజాగా దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు శాఖల పేర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లను మార్పు చేసింది. ఈ మార్పుల వల్ల ఖాతాదారులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ గుప్తా తెలిపారు. ఒకవేళ పాత ఐఎఫ్ఎస్సీ కోడ్ ఆధారంగా లావాదేవీలు జరిగినప్పటికీ, కొత్త కోడ్కు అనుగుణంగా మార్పు చేస్తామని, ప్రకటించారు. ముంబయి, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, లఖ్నవూ వంటి ప్రధాన నగరాల్లోని శాఖల్లో ఈ కొత్త కోడ్ మార్పును అవలంభించారు. అంతే కాదు మారిన బ్యాంకు శాఖల పేర్లు, వాటి ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను ఎస్బీఐ తన వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు.