తాడేపల్లి, డిసెంబర్ 10 : నేడు ఉదయం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద పేలుడు సంభవించి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...బతుకు దెరువు కోసం తాపీగా పనిచేసే, జి.నాగరాజు తన నివాసం వద్ద ఓ ప్లాస్టిక్ డబ్బాను కోస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో నాగరాజు, అతని భార్య భాను, తల్లి నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్లాస్టిక్ డబ్బా పేలడానికి గల కారణాలేంటో, పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.