ముంబాయి, డిసెంబర్ 9: మాజీ ప్రపంచ సుందరి, అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరోసారి నెట్టింట్లో మెరిసింది. తన అందమైన లుక్ తో అందరినీ కట్టిపడేసింది. శుక్రవారం రాత్రి అంబానీ నివాసంలో జరిగిన పార్టీకి ఐశ్వర్య తన భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి వెళ్ళింది. ఈ సందర్బంగా ఆమె దిగిన ఫోటోలను స్టైలిస్ట్ ఆస్తా శర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో సుందరి పసుపు రంగు గౌను ధరించి కనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే.. ఆ గౌను ధర రూ.3.7 లక్షలు కావడం. ఐశ్వర్య అంతా ఖరీదైన గౌను ధరించి హాజరు కావడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.