హైదరాబాద్, డిసెంబర్ 09 : గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గేమర్ కనెక్ట్ ప్రదర్శనకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్ రంగం వల్ల 240 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. కాని మన దేశంలో మాత్రం 2 బిలియన్ డాలర్ల లోపే ఉంది. ఇదే రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి" అని పేర్కొన్నారు. ఇందుకోసం పెట్టుబడులతో ముందుకు రావాలని ప్రైవేటు కంపెనీలకు కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మల్టీమీడియా రంగానికి పెద్దపీట వేస్తోందని, దీనికి అవసరమైన మేర మౌలిక వసతులు కల్పించామన్నారు.