న్యూఢిల్లీ, డిసెంబర్ 7: టీంమిండియా సారధి విరాట్ కోహ్లీ, తన ప్రేయసి అనుష్కతో వివాహనికి శుభం కార్డు పడిందట. గత కొద్ది రోజుల నుండి ఈ జంట పెళ్లిపై ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికై ఒకవైపు కోహ్లీ, మరోవైపు అనుష్క అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఎటువంటి హంగామా లేకుండా నిరాడంబరంగా వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాలుగు ఏళ్లగా ప్రేమించుకుంటున్న ఈ జంటను ఏకం చేయాలని నాలుగు నెలల క్రితమే ఇరు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటలీలోని మిలాన్లో డిసెంబరు 12న ఈ జంట పెళ్ళాడానున్నారట. ఈ వేడుక ముగిశాక డిసెంబరు 21 లేదా 22న ప్రముఖులకు ముంబయిలో భారీ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోహ్లీ, అనుష్క కుటుంబ సభ్యులు, తదితరులు ఇటలీ చేరుకున్నారు. అయితే ఈ పెళ్ళికి ఇద్దరు క్రికెటర్లు, ముగ్గురు స్టార్ హీరోలకు ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారెవారంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్, సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్, షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, ఆదిత్యచోప్రా, డైరెక్టర్ మనీశ్ శర్మలు.