న్యూఢిల్లీ, డిసెంబర్ 9: టెక్నాలజీని అనుసరించి ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్, మోడల్ వస్తువులతో దిగ్గజ హెచ్పీ సంస్థ ముందంజలో ఉంటుంది. తాజాగా 3డి ప్రింటర్లను మార్కెట్లో ప్రవేశపెడుతామని ఈ సంస్థ ప్రకంటించింది. ఈ సందర్బంగా హెచ్పీ ఇండియా ఎండీ సుమీర్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం వాణిజ్య విభాగంపైనే వారు దృష్టి పెడుతున్నట్లు, 2018 నాటికి తొలి త్రైమాసికంలో 3డి ప్రింటర్లను విపణిలో విడుదల చేస్తామని అన్నారు. ఈ ప్రింటర్లకు ఆటో మొబైల్, హెల్త్కేర్, తయారీ రంగంలో, ప్లాస్టిక్ను ముద్రణలో ఎక్కువ ఉపయోగం ఉంటుందని తెలిపారు. భారత్లో దీని ధర ఇంకా నిర్దారించాలేదని, కానీ అంతర్జాతీయ మార్కెట్లో కనీసం లక్ష డాలర్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఇవి జపాన్, చైనా మార్కెట్లలో ఉన్నాయి.