హైదరాబాద్, డిసెంబర్ 09 : నగరంలోని రాజేంద్రనగర్ ఠాణా రికార్డు నెలకొల్పింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి 2,500వ ఎఫ్ఐఆర్ నమోదు కావడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇది మొదటిసారి. సాధారణంగా ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్ లలో సత్వరం ఎఫ్ఐఆర్ నమోదు చేసే వారు కాదు. భారీ చోరీల్లాంటివి జరిగినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యేది. కాని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వేరు. ఏదైనా ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ జారీ చేయాలని కమిషనర్ సందీప్ శాండిల్య ఆదేశించారు. ఇక రాజేంద్రనగర్ ప్రాంతంలో ఘర్షణలు తరచూ చోటుచేసుకుంటాయి. ఈ తరుణంలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ జారీ చేయడంతో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యేవి.