హైదరాబాద్, డిసెంబర్ 08 : మెగా అభిమానులకు శుభవార్త...టాలీవుడ్ లో ఇప్పటికే మెగా వారసుల హవా అప్రతిహతంగా సాగుతుంది. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ హీరోగా త్వరలో ఓ సినిమాతో అరంగేట్రం చేయనున్నారు. చిరంజీవి కుటుంబం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్న పదో వ్యక్తి కల్యాణ్ కావడం విశేషం. ఈ చిత్రంను వారాహి చలనచిత్ర ఆధినేత సాయి కొర్రపాటి నిర్మిస్తుండగా, రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. నటన మీద ఉన్న మక్కువతో కళ్యాణ్ వైజాగ్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం స్వయంగా చిరంజీవి అల్లుడికి శిక్షణ ఇవ్వమని ‘స్టార్ మేకర్’ సత్యానంద్ను అడిగారని తెలుస్తోంది. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పవర్ స్టార్ పవన్కల్యాణ్, రవితేజ, మహేశ్బాబు, ప్రభాస్, వరుణ్తేజ్, తదితరులు సత్యానంద్ శిష్యులే. ఇంతకముందు అంతర్జాలంలో కళ్యాణ్ ఫొటోషూట్కు సంబంధించిన పలు చిత్రాలు తెగ హల్ చల్ చేశాయి.