ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ సేవలు : కేటీఆర్

SMTV Desk 2017-12-08 15:02:45  IT Towers, minister ktr, mahabhoob nagar, 18 it projects.

మహబూబ్‌నగర్‌, డిసెంబర్ 08 : మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేటలోని తన నివాసంలో 18 ఐటీ సంస్థల ప్రతినిధులను కలిసి అంగీకారపత్రాలను అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. "హైదరాబాద్‌తో పాటు ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించనున్నాయి. ఐటీ పరిశ్రమల స్థాపనకు 18 సంస్థలు ముందుకొచ్చాయి. ఇప్పటికే పలు జిల్లాలో ఐటీ సేవలు ప్రారంభమయ్యాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లోనూ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి. దీని కోసం తెలంగాణ పారిశ్రామికవేత్తల సహకారం కూడా తీసుకుంటాం. ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయం" అంటూ పేర్కొన్నారు.