నంది మేడారం ప్రాజెక్ట్‌ ను పరిశీలించిన కేసీఆర్

SMTV Desk 2017-12-08 14:44:41  kcr, kaleshvaram project tour, nandi medaram.

పెద్దపల్లి, డిసెంబర్ 08 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే లక్ష్మీపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులను, రామగుండంలో నూతనంగా నిర్మిస్తున్న పవర్‌ప్లాంట్‌ ప్రాజెక్టులను కూడా ఆయన పరిశీలించారు. ఎన్టీపీసీ ఈడీ దిలీప్‌కుమార్‌ దూబే పనుల వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీపీసీ అతిథిగృహంలో రాత్రి బస చేశారు. ఎస్సారెస్పీ, మధ్య మానేరు ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌ బయలుదేరనున్నారు. ఆయన వెంట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నారు.