న్యూఢిల్లీ, డిసెంబర్ 07 : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తన ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిదో ప్రశ్న వేశారు. ఆ ట్వీట్ లో రాహుల్ రైతుల సమస్యలపై ప్రస్తావించారు. "రైతులకు ఎలాంటి రుణమాఫీ చేయలేదు. అంతేకాకుండా బీమా కల్పించలేదు. ఆ పంటలకు సరైన మద్దతు ధర కూడా కల్పించలేదు. వారి నుండి బలవంతంగా పంటపొలాలను లాక్కున్నారు. ఇవ్వని చేయకుండా రైతుల మీద ఎందుకు సవతి తల్లి ప్రేమను నటిస్తున్నారు . ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో చెప్పాల్సిన అవసరం ఉందంటూ గుజరాత్ డిమాండ్ చేస్తోంది" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.