తిరుచ్చిలో ఘోర రోడ్డు ప్రమాదం ... 10 మంది మృతి

SMTV Desk 2017-12-07 13:21:14  tamilnadu, road accident, tirucchi, ten people died

చెన్నై, డిసెంబర్ 07 : తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తువరన్‌కురిచ్చి జాతీయ రహదారి రక్త సిక్తమైంది. నాగర్‌కోయిల్‌ నుంచి తిరుపతి వెళుతున్నఓ వ్యాన్, బోర్‌వెల్‌ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు క్షతగాత్రులయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. తిరుచ్చి ఎస్పీ పీఎస్సీ కల్యాణ్‌ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.