పట్నా, డిసెంబర్ 07 : బీహార్ రాజధాని పట్నాలోని మగధ్ మహిళా కళాశాలలో కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా 1 నుంచి యువతులు కళాశాలకు జీన్స్, పటియాలా డ్రెస్సులు వేసుకుని రాకూడదని ఆంక్షలు విధించింది. కొంతమంది విద్యార్థులు ధరిస్తున్న దుస్తులు అభ్యంతరకరంగా ఉంటున్నాయని, అందుకే కొత్త డ్రెస్ కోడ్ ను ప్రవేశపెట్టనున్నామని ఆ కళాశాల ప్రిన్సిపల్ శశిశర్మ వెల్లడించారు. అంతేకాకుండా కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్స్ వాడకాన్ని నిషేదించారు. ఒకవేళ ఫోన్ వాడాలి అనుకుంటే మొబైల్ ఫ్రీ జోన్ లో వాడుకోవచ్చని పేర్కొన్నారు.