న్యూఢిల్లీ, డిసెంబర్ 6: వెండితెరపై అగ్రనటుడిగా పేరొందిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, త్వరలో బుల్లితెరపై రైతుల కోసం ఓ యాడ్ లో కనిపించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసార పరీక్షలు, పంటల బీమా వంటి వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన, పరంప్రగత్ క్రిషి వికాస్ యోజన వంటి పథకాలకు కూడా ఆయననే నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. అంతేకాదు అక్షయ్ నియామకం వల్ల రైతులకు పథకాలపై గల అవగాహన పెంపొందించొచ్చని వారు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అక్షయ్ బుల్లితెరపై కొన్ని యాడ్స్ లలో కనిపించిన సంగతి తెలిసిందే.