రైల్వే అధికారులకు ఐఎస్బీ అధ్యాపకుల శిక్షణ..!

SMTV Desk 2017-12-06 16:20:47  South Central Railway, Indian School of Business, training.

న్యూఢిల్లీ, డిసెంబర్ 06 : దక్షిణ మధ్య రైల్వే సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వే అధికారులు, సిబ్బంది సమర్ధవంతంగా పని చేసేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించే౦దుకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్(ఐఎస్బీ) తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులకు ఐఎస్బీ అధ్యాపకులు శిక్షణ ఇవ్వనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ యాదవ్‌, ఐఎస్‌బీ డీన్‌ రాజేందర్‌ శ్రీవాస్తవ రైల్‌ నిలయంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.